మెదక్

తిరుగులేని శక్తిగా బీజేపీని తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా బీజేపీని తీర్చి దిద్దుతుండగా, అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నట్లు బీజేపీ జిల్లా ఇన్‌చార్జి పాపారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, బీజేపీ ఓబీసీసెల్ కార్యదర్శి ఆకుల రాజయ్యలు పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్‌లో వారు విలేఖరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండగా, కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు టీఆర్‌ఎస్ డబ్బా కొట్టుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. అయితే తెలంగాణాలో విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షాలు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుండగా, దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నట్లు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మజ్లీస్‌కు వేసినట్లేనని తెలిపారు. అలాగే గజ్వేల్‌లో దీటైన అభ్యర్థిని రంగంలో దింపుతుండగా, సోమవారం రాత్రి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో సమావేశమై ఉమ్మడి నిర్ణయంతో ఆకుల రాజయ్యను అభ్యర్థిగా ప్రకటించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో నేతలు ఎల్లు రాంరెడ్డి, మదుసూదన్, పేర్ల శ్రీనివాస్, మనోహరాచారి, కుడిక్యాల రాములు, ఎల్కంటి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.