మెదక్

కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 25 : సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 26,8 వార్డుల్లో ఇంటింటీ ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి, నుదుటి తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఈసందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్నారు. కేసీఆర్ మరోసారి మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మోసపూరితమైన వాగ్ధానాలను ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి విస్మరించినట్లు తెలిపారు. మైనార్టీ కమ్యూనిటీ హాల్‌కు 2009లో శంకుస్థాపన చేసి విస్మరించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలతో పాటు, మైనార్టీ కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తామని హామీనిచ్చారు. ప్రజలు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. కేంద్రం,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో డీసీసీ మైనార్టీ సేల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తుఇమామ్, షాబోద్దీన్, పాషా, ఫయాజ్, ఫరీద్, సులేమాన్ రఫీ, జాపర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.