మెదక్

రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయికోడ్, నవంబర్ 16: రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అందోల్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మిని దామోదర్ స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని కోడూర్, హస్నాబాద్, ఎనికెపల్లి, ఔరంగనగర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తూ కాంగ్రెస్‌కు ఓటు వెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా పద్మిని దామోదర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫితో పాటు, వృద్దులకు రెండు వేలు, వికలాంగులకు మూడు వేల ఫించన్లు, నిరుద్యోగ భృతి, ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం హస్నాబాద్, సింగీతం, పాంపాడ్ గ్రామాల తెరాస పలువురు కార్యకర్తలు పద్మిని దామోదర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా పాంపాడ్ గ్రామానికి చెందిన తెరాస కార్యకర్తలు సంగారెడ్డిలోని దామోదర్ స్వగృహానికి వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, జడ్పీటీసీ అంజయ్య, ఎంపీపీ వెంకట్రావ్, నాయకులు బాసిద్‌పటేల్, సుల్తాన్, సతీష్, అలిమోద్దీన్, మాజీ ఎంపీపీ వీరయ్యస్వామి, మాజీ ఎంపీటీసీ విఠల్, ఎంపీటీసీలు మెట్టు మంజుల, శశికాంత్‌పాటిల్, ఆనంద్, యాదవ్, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.