మెదక్

20 మంది అధికారులకు షోకాజు సోటీసులు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, నవంబర్ 17: ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని (20) మంది ప్రిసైడింగ్, అసిస్టెంటు ప్రిసైడింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హన్మంతరావు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరుకాని ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈ నెల 17న నిర్వహించిన శిక్షణ తరగతులకు హజరుకావడానికి చివరి అవకాశం ఇచ్చినా, శిక్షణ తరగతులకు గైర్హాజరైన 20 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసామన్నారు. 14, 15 తేదీలలో శిక్షణకు హాజరుకాని 65 మందిలో శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి 25 మంది హాజరయ్యారని స్పష్టం చేసారు. మరో 20 మంది మెడికల్ లీవులో, మెటర్నటీ సెలవులలో ఉన్నారని వివరించారు. ఆదేశాలను ఉల్లంఘించిన 20 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.