మెదక్

‘మహా’ఓటమి తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 18 : మహాకూటమిని ప్రజలు నమ్మరని, కూటమికి ఓటమి తప్పదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండలం మేడిపల్లి, నర్సాపూర్‌కు చెందిన బీజేపీ నేతలు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలను ప్రజలు నమ్మరన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకునే నేతలను ఆదరిస్తారన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ప్రజల ఇంటిపార్టీ అని, కుటుంబ సభ్యులవలే ప్రజల కష్ట, సుఖాల్లో పాలుపంచుకున్నానన్నారు. టీఆర్‌ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు. మహాకూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, కేసీఆర్ మళ్లీ సీఎం కావటం ఖాయమన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో కరువు ఉండదన్నారు. వచ్చే ఏడాదికి గోదావరి వస్తుందని ఈప్రాంత సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సత్యనారాయణరెడ్డి, బండార నర్సింలు, వెంకటస్వామి, కిరణ్,ప్రభాకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.