మెదక్

కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయికోడ్, నవంబర్ 18: కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు అందోల్ నియోజకవర్గం, రాయికోడ్ మండలం అన్ని విధాలుగా అభివృద్ది జరిగిందని, మరింత అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్, అందోల్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహా పేర్కొన్నారు. ఆదివారం రాయికోడ్‌లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని గుర్తు చేశారు. మాట ఇచ్చి నిలుపుకున్న ఘనత సోనియాగాంధీదే అన్నారు. సీఎం కేసీఆర్ పచ్చి మోసగాడని, అతను నోరు తెరిస్తే అన్ని అబద్దాలేనని ఆయన విమర్శించారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్‌రూమ్‌లు వంటి హామీలు ఇచ్చిన కేసీఆర్ ప్రజలను మోసం చేశాడన్నారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రతి ఒక్కరు చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేయాలని ఆయన వివరించారు. ముందుగా పాండురంగ దేవాలయం, వీరభద్రేశ్వర ఆలయం, చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
* తెరాస నుండి కాంగ్రెస్‌లో చేరిక
ఆదివారం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో వివిధ గ్రామాలకు చెందిన తెరాస కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఇందూర్ మాజీ పీఎసీఎస్ చైర్మన్ బి.బుచ్చన్నపాటిల్, రాయికోడ్ నారాయణ, నాగయ్య, వైసీపీ మండల అధ్యక్షులు మల్లన్న, పలువురు మత్య్సకారులు, తిప్పడ్‌పల్లి, రాయిపల్లి గ్రామాలకు చెందిన 200 మంది తెరాస కార్యకర్తలు ఉన్నారు. వారికి దామోదర్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో రాంచందర్ రాజనర్సింహా, డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, జడ్పీటీసీ అంజయ్య, ఎంపీపీ వెంకట్రావు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ కేథర్‌నాథ్, ఎంపీటీసీ శశికాంత్‌పాటిల్, నాయకులు మొగులప్ప, శ్రీనివాస్‌గౌడ్, సతీష్‌కుమార్, నవీన్‌కుమార్, హన్మాగౌడ్, బాలాజీ నర్సింలు, బాలయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు.