మెదక్

రాజకీయాల ఊసెత్తని కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 20 : టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పురిటగడ్డలో నిర్వహించిన సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల ప్రచార సభలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చి, ప్రతిపక్ష పార్టీల నేతలను పల్లెత్తి మాట్లాడకపోవటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్ ప్రసంగంలో పంచ్ డైలాగ్‌లు, ప్రతిపక్ష పార్టీల నేతలపై పదునైన విమర్శలు లేకపోవటంతో కేసీఆర్ ప్రసంగం టీఆర్‌ఎస్ కార్యకర్తలను, నాయకులను, అభిమానులను నిరాశకు గురిచేసింది. సిద్దిపేట పత్తిమార్కెట్ యార్డు మైదానంలో మంగళవారం నిర్వహించిన సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల ప్రచార సభకు వేలాదిమంది లారీలు, ఆటోలు, డీసీఎంలు, ద్వీచక్ర వాహనాల్లో పెద్దఎత్తున తరలివచ్చారు. సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలు మేలాతాళాలతో, పాదయాత్ర, ర్యాలీగా తరలివచ్చారు. మధ్యాహ్నాం 12గంటల వరకు సభా ప్రాంగణమంత జనంతో క్రిక్కిరిసిపోయింది. సీఎం కేసీఆర్ ప్రసంగానికి వినేందుకు ప్రజలు ఏంతో ఆసక్తిగా ఎదురుచూసారు. సీఎం కేసీఆర్ షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా వచ్చినప్పటికి ప్రజలు కేసీఆర్ వచ్చి అభివాదం చేయగానే ఉత్సహాంగా కేరింతలు కొట్టారు. కేసీఆర్ సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడిన 22 నిమిషాలు రైతుల అభివృద్ధి, మహిళ సంఘాలు, రేషన్ షాపులు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గూర్చి మాత్రమే ప్రసంగించారు. తన పురిటగడ్డ నుండి రైతులను ధనవంతులుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కల్తీలేని ఆహార పదార్థాలు రేషన్‌డీలర్లు సరఫరా ప్రధానంగా ప్రసంగించారు. కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యత కల్పించారు. సీఎంకు కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ఉత్సహాంగా వచ్చిన ప్రజలకు కేసీఆర్ తన ప్రసంగంలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు, టీజేఎస్ పార్టీలను పలెత్తి మాట సైతం ప్రస్తావించకపోవటం తీవ్ర నిరాశకు గురిచేసింది. సభ వేదికపై కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గూర్చి మాట్లాడాలని చిట్టి వచ్చిందని ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి సిద్దిపేట ప్రజలకు బాగ తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను సిద్దిపేట ప్రజలే చూసుకుంటారని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ పురిటగడ్డయైన సిద్దిపేట ఎన్నికల ప్రచార సభలో రాజకీయ పార్టీల నాయకులపై ఏలాంటి విమర్శలు లేకుండ అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చి మాట్లాడడంతో సీఎం కేసీఆర్ ప్రసంగం చప్పగా ఉందని పెదవి విరవటం గమనార్హం. సీఎం కేసీఆర్ పదునైన మాటలు, పంచ్ డైలాగ్‌లు వినేందుకు ఏంతో ఆసక్తితో వచ్చిన టీఆర్‌ఎస్ అభిమానులకు కేసీఆర్ ప్రసంగం తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పవచ్చు.

దివ్యాంగులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి
* ఓటు హక్కును వినియోగించుకోవాలి
* కలెక్టర్ హన్మంతరావు
సంగారెడ్డి టౌన్, నవంబర్ 20: దివ్యాంగులందరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎం.హన్మంతరావు సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్‌లో దివ్యాంగులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు మానసికంగా కృంగి పోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కోరారు. జరగబోయే ఎన్నికల్లో నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు క్రీడా పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ప్రారంభించారు. షాట్‌ఫుట్, రన్నింగ్, చెస్, క్యారమ్ తదితర పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మోతి, దివ్యాంగుల సంఘ నాయకులు మహేష్, జుబేదా, రాంశెట్టి, వెంకటేష్, ప్రవీన్, భిక్షపతి, శ్రీనివాస్, కరుణాకర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.