మెదక్

గాడిలో పడిన ప్రజాపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 17: పేద మహిళలకు పంపిణీ చేయాల్సి ఉన్న బతుకమ్మ చీరలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీ నుండి చీరల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుండి బతుకమ్మ చీరల పంపిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదిముబారక్, జూనియర్ గ్రామ కార్యదర్శుల నియామకం, గ్రామ పంచాయతీల ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూ సేకరణ, క్రిస్‌మస్ గిప్ట్ ప్యాకుల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనేలా చూడాలన్నారు. రోజువారి పంపిణీకి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జెయేష్ రంజన్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, వాటిని 5 లేదా 6 రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా గోడౌన్స్ నుండి గ్రామ స్థాయి గోదాములకు చేరేలా రవాణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామస్థాయి గోదాములకు పర్సనల్ ఇంచార్జిలను నియమించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పంపిణీకి సంబంధించి మహిళా సంఘాలు, అధికారులు, వార్డు కమిటీలను నియమించి సమీక్షించాలని తెలిపారు. గ్రామాలలో పంపిణీ తేదీలను పత్రికల ద్వారా ప్రజలకు తెలిసేలా ప్రచారం చేపట్టాలన్నారు. జౌళి, చేనేత శాఖ కమీషనర్ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ చీరల పంపిణీలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్లను కోరారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 60 రోజులకు మించి దాదాపు వెయ్యి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని,
ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన వెంకటేశ్వరాలయం
సిద్దిపేట, డిసెంబర్ 17 : ముక్కోటి ఏకాదశి పర్వదినానికి సిద్దిపేట కొత్త వేంకటేశ్వరాలయంలో ముస్త్భాంది. ఈనెల 18న మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి,వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వెంకటేశ్వరాలయాన్ని రంగు లు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.వెంకటేశ్వరాలయాన్ని పూలతోప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
వెంకటేశ్వరాలయంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 50వేలకు పైగా పైగా భక్తులు హాజరవుతుండటం వల్ల భక్తులకు ఏలాంటి ఇబ్బందులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వెంకటేశ్వరాలయం నుండి జిల్లా జడ్జీ, గాంధీ చౌక్, వీర సావర్కర్ చౌరస్తా వరకు పెండెల్స్ ఏర్పాటు చేశారు. భక్తులకు జిల్లా జడ్జీ, గాంధీ చౌక్ వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసి ధర్మ దర్శనానికి బారికేడ్లు నిర్మించారు. అలాగే వీవీఐపీలకు రూ. 500, రూ.100 రూపాయలకు ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి, వైకుంఠ ద్వార నిర్మాణానికి సహాకరించిన వారికి దేవాలయం నుండి గుర్తింపుకార్డులుఇచ్చిప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ ద్వారం గుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జడ్జీలు, జిల్లా స్థాయి అధికారులు, జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తున్నారు.
భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండ అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు. వెంకటేశ్వరాలయం సోమవారం ఉదయం నుండి ఎడతేరిపి లేకుండ కురుస్తున్న వర్షం వల్ల వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇప్పటికే ఆలయం ప్రాంగణం పెండిల్స్ ఏర్పాటు, భారికేడ్లు నిర్మిస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్, అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ రామేశ్వర్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండ అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆలయ కార్యనిర్వాహాణాధికారి విశ్వనాథశర్మ, ఆలయకమిటీ చైర్మన్ నగేశ్ విష్టు తెలిపారు. భక్తులకు క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం కలిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరికి ప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారు జామున 4గంటల నుండి వైకుంఠ ద్వార గుండా భక్తులకు వైకుంఠనాథుడు దర్శనమిస్తారన్నారు. అప్పటి నుండి రాత్రి వరకు భక్తులకు వైకుంఠ ద్వారంగుండ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నారు. వైకుంఠద్వారం వెలుపలనే కొబ్బరికాయలు కొట్టెందుకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. . భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామికృపకు పాత్రులు కాగలని కోరారు.
మిరుదొడ్డి : మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి, శ్రీవేంకటేశ్వరా దేవాలయాలు నిర్వహించనున్న ముక్కోంటి ఏకాదశి కోసం అలయాలను ముస్తాబు చేస్తున్నారు. ముక్కోంటి ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని అలయ దర్మకర్తలు ఎకె వరదచారి, రాజగోపాల్‌చారి, అర్చకులు ఎకె పార్థసారిధి, చైర్మన్ అంజిరెడ్డి, శ్రీవెంకట్వేర స్వామి దేవాలయం ధర్మకర్త సుతారి సత్తయ్య కోరారు. ఈ కార్యక్రమాన్ని పురష్కరించుకొని భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు హజరుకావాలని వారు కోరారు.
గాడిలో పడిన ప్రజాపాలన
ఆయా జిల్లాల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ కల్యాణలక్ష్మీ, షాదిముబారక్‌లకు జిల్లాల వారీగా అవసరమైన నిధుల వివరాల ప్రతిపాదనలు పంపాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బెనహర్ మనేష్‌దత్ ఎక్యా మాట్లాడుతూ క్రిస్‌మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు గిప్ట్ ప్యాక్‌లను ఈ నెల 18న, ఫుడ్ మెటీరియల్ ప్యాక్‌లను ఈ నెల 20న పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆసరా పింఛన్లకు సంబంధించి సీఎస్ మాట్లాడుతూ 57 సంవత్సరాల వయస్సు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు జాబితాను వినియోగించుకోవాలని తెలిపారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాల వారీగా లబ్దిదారుల సంఖ్యను తెలియజేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ మాట్లాడుతూ ఓటరు జామితాలో 57 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వారి విరాలను తీసుకుని ఎస్‌కెఎఫ్ డాటాతో సరిచూసుకుని రెండు, మూడు రోజుల్లోగా డ్రాప్ట్ లీస్ట్‌ను గ్రామ సభల్లో పబ్లీష్ చెయ్యాలని సూచించారు. నిబంధనల మేరకు పింఛన్లు మంజూరి చేయాలని కలెక్టర్లతో స్పష్టం చేసారు. పింఛన్‌కు అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామ సభలో పెట్టి ఆమోదం పొందిన తరువాత ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి కొత్త పెన్షన్లు అందించనున్నట్లు తెలిపారు. 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి జిల్లాల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల హాల్ టికెట్ల నంబర్లను పత్రికలలో ప్రచురించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25లోగా నియామక పత్రాలు జారీ చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లతో సంసిద్దంగా ఉండాలనితెలిపారు. జిల్లాల వారీగా క్యాటగిరి ప్రకారం సీట్లను రూపొందించాలన్నారు. జాతీయ రహదారుల భూ సేకరణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు. ఎన్‌హెచ్‌ఐకీ సంబంధించి 16 జిల్లాలో, ఎన్‌హెచ్‌కు సంబంధించి 17 జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఈ విషయమై ప్రత్యేకంగా సమీక్షించి పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి నుండి కలెక్టర్ హన్మంతరావు, డీపీఓ వెంకటేశ్వర్లు, చేనేత, జౌళి శాఖ అధికారి విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వీడియోకాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో మెప్మా పీడీ రమేష్, డీపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్లు, తహశీల్దార్లతో కలెక్టర్ హన్మంతరావు సమావేశం నిర్వహించారు. బతుకమ్మ చీరలు, క్రిస్‌మస్ గిప్ట్ ప్యాక్స్ పంపిణీ, 57 సంవత్సరాలు పూర్తయిన ఆసరా పింఛన్‌కు అర్హులైన వారి ఎంపిక, జూనియర్ పంచాయతీ సెక్రటరీల దృవపత్రాల పరిశీలన తదితర అంశాలపై దిశా నిర్దేశం చేసారు. ఏలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా కొనసాగేలా బాధ్యతగా పని చేయాలని అధికారులకు సూచించారు.
సంక్షేమ పథకాల పంపిణీ..
జాబితాను సిద్ధం చేయండి
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి
సిద్దిపేట, డిసెంబర్ 17 : బతుకమ్మ చీరల పంపిణీ, కల్యాణలక్ష్మి షాదీ ముబారక్, 57 ఏండ్లు నిండిన వృద్ధులకు ఆసర పింఛన్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషీ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా రానున్న గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలు, జూనియర్ గ్రామపంచాయతీ కార్యదర్శుల నియామకం విషయాలపై కలెక్టర్‌తో చర్చించారు. ఈకార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నుండి కలెక్టర్ కృష్ణ్భాస్కర్, జేసీ పద్మాకర్, ట్రైనీ ఐఏఎస్ అవిష్యంత్ పండా, డీపీఓ సురేష్‌బాబు ,డీఆర్‌డీఎ పీడి నవిన్‌కుమార్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్నారు.