మెదక్

ప్రజల హక్కులను కాలరాస్తున్న టిఅర్‌ఎస్:విమలక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జగదేవ్‌పూర్, జూలై 25 : ప్రజల హక్కులను టిఅర్‌ఎస్ ప్రభుత్వం కాలరాస్తుందని తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క విమర్శించారు. సోమవారం మల్లన్నసాగర్ భూబాదితులను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో కొండపాక మండలం కుకునూరుపల్లి వద్ద పోలీసుల అరెస్ట్ చేసి జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ శాంతియుతంగా తమ నిరసనను తెలియజేసేందుకు వస్తున్న భూబాదితులను పోలీసులు అడ్డుకొని విచక్షనారహితంగా వారిపై లాఠీచార్జి చేయడం విచారకరమని నిలదీశారు. 2013 జిఒ ప్రకారం పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో ప్రజాసంఘాల ఆద్వర్యంలో బాదితులకు అండగా నిలిచి పోరాటం చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో అఖిల పక్షం నేతలు భానుప్రకాశ్‌రావు, మహేందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.