జాతీయ వార్తలు

మథుర అల్లర్లపై సుప్రీంలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: యుపిలోని మథురలో గత శుక్రవారం జరిగిన అల్లర్లపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీం కోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ ప్రారంభిస్తామని వెకేషన్ బెంచ్‌లోని న్యాయమూర్తులు ప్రకటించారు. మథురలో జరిగిన అల్లర్లలో ఐపిఎస్ అధికారి సహా 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఒక పార్కును ఆక్రమించిన ముఠా ఈ అరాచకానికి కారణమంటూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, అత్యున్నత స్థాయిలో విచారణ బృందాన్ని నియమించాలని పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది కోర్టును కోరారు.