ఆంధ్రప్రదేశ్
వైద్యవృత్తి వ్యాపారం కారాదు: గవర్నర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 March 2016
విజయవాడ: మానవతా విలువలతో వైద్యులు రోగులకు సేవలందించాలని, వ్యాపార ధోరణిని విడనాడాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. ఇక్కడ బుధవారం జరిగిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రోగులకు సేవలందించే ముందు ‘ఇన్స్యూరెన్స్ ఉందా?’ అని అడగడం మానేసి వైద్యులు నిజాయితీగా సేవలందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు యువ వైద్యులు కృషిచేయాలన్నారు. వైద్యవిద్య పూర్తి చేసిన వారికి ఆయన పట్టాలను అందజేశారు.