విజయవాడ

మళ్లీ మన వొడిలోకే చేరు.. (చిన్నకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్లో సమోసాలు కొనుక్కుంటూ మా పెట్టెలోకి వచ్చిన మూడేళ్ల కుర్రాడిని చూసి ఉలిక్కిపడ్డాను. వాడు అచ్చు స్వాతి బాబులా వున్నాడు. మూడు దశాబ్దాల క్రితం విజయవాడలో ఉండగా మా పక్కింట్లో ఆంధ్రా బ్యాంకులో పనిచేసే ఆనందరావు దంపతులకి ఒక్క బాబు. వాడు స్వాతి నక్షత్రంలో పుట్టేడని వాడికి ఆ పేరు పెట్టమని చెప్పాం. వాళ్లు మా ఇంట్లో వున్నంతకాలం ఎక్కువగా నా దగ్గరే ఉండేవాడు. తరువాత వారికి ఇద్దరు కవల ఆడపిల్లలు కలిగారు. పిల్లలని తీసుకుని కాశీ వెళ్లినప్పుడు అక్కడ స్వాతిబాబు మరణించాడు. పడవలో గంగానది మధ్యకి వెళ్లిన స్వాతిబాబుని గంగలో వదిలేసి వచ్చామని ఆమని గారు వెక్కివెక్కి ఏడవడం, వాడి గురించి నేను బెంగపడి మంచం పట్టడం, కొన్నాళ్లకి వాళ్లు బదిలీ అయి నెల్లూరు వెళ్లిపోవడం జరిగిపోయాయి. ఆల్బం తీసి చూసినప్పుడల్లా స్వాతిబాబుని ఎత్తుకుని దిగిన ఫొటో చూసి బాధపడేదాన్ని. ఆమని గారు ఎలా వున్నారో? తరచూ చూడటం వల్ల స్వాతిబాబు రూపం నాకు గుర్తుండిపోయింది. అచ్చు అలాగే ఉన్నాడు ఈ పిల్లాడు!
‘స్వాతీ.. ఇలా రారా!’ అంటూ ఒకామె మా పెట్టెలోకి వచ్చింది. ఆమెను చూసి నేను గుర్తుపట్టాను. ‘ఆమనీ’.. పిలిచాను చిన్నగా.
నా వంక ఆశ్చర్యంగా చూస్తూ ‘మా అమ్మ పేరు ఆమని’ అన్నది.
‘నువ్వు ఆనందరావుగారి అమ్మాయివా?’ అడిగాను.
‘అవునండీ! మీకు మా అమ్మా, నాన్న తెలుసా?’ అంది.
‘బాగా తెలుసు. మీరు పుట్టింది మా ఇంట్లోనే. నీ పేరు పద్మినా? లలితనా?’ అని అడిగాను.
‘మా అందరి గురించి చెప్పేస్తున్నారు. అమ్మకి మీరు బాగా దగ్గరి ఫ్రెండ్ అన్నమాట. పక్క పెట్టెలో మా అమ్మగారు వున్నారు, పిలుచుకొస్తాను’ అంటూ వెళ్లి ఆమనిని తీసుకొచ్చింది.
ఇద్దరి కళ్ల వెంటా ఆనందబాష్పాలు.
‘స్నేహబంధమూ.. ఎంత మధురమూ!..’ అన్నాను ఆశ్చర్యంగా!
‘అవును ఆల్బంలో వాడి ఫొటోలు వచ్చినప్పుడల్లా చూసేవారు. అన్నయ్య రూపు వాళ్ల మనసులో.. వాడు లేకున్నా మేనమామ పోలికలో వీడు.. ఇదే మరి. మమతానురాగాలు స్వాగతాలు పాడ అంటే. మళ్లీ తనవాళ్ల మధ్యలోకి వాడు’ కన్నీళ్లతో చెప్పింది ఆమని.

- వేమూరి అనూరాధ, విజయవాడ.
**

నివాళి
*
నవ్యాంధ్ర శారదా శాంతినికేతన్.. ఆచార్య రాయప్రోలు!
మార్చి 13వ తేదీ కవిభూషణ్ ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారి 125 వ జయంతి. ఆధునికాంధ్ర కవిత్వాన్ని సుసంపన్నం చేసిన భావకవి కోకిల స్వామి ఆయన. వారి పేరు చెబితే చాలు - ‘అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపింతునాడు’- అనే పద్యం గుర్తుకొస్తుంది. ‘ఏదేశమేగినా ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీజాతి నిండు గౌరవము’ అనే దేశభక్తి గేయం వెంటనే స్ఫురిస్తుంది. అమలిన శృంగార సిద్ధాంతమొకటి జ్ఞప్తికొస్తుంది. తొలిగా వీరు తమ మేనమామ గారైన అవ్వారి సుబ్రహ్మణ్యశాస్ర్తీ గారితో కలిసి అవధాన, ఆశుకవితా ప్రదర్శనలిచ్చి, పద్య రచనలో ధారాశుద్ధిని సంపాదించుకున్నారు. వరుసకు పినతల్లి అయిన శ్రీమతి రామడుగు నరసమ్మ గారి వద్ద వెదుళ్లపల్లిలో పెరిగి, మన భారత రామాయణాదులలో స్ర్తి ఏవిధంగా సమస్యలకు గురయిందో ఆమె ద్వారా తెలుసుకున్నారు. అది భవిష్యత్తులో తాను ప్రతిపాదించబోయే అమలిన శృంగార సిద్ధాంతానికి ప్రాతిపదిక అయింది. రుద్రటుడనే సంస్కృతాలంకారికుడు ప్రతిపాదించిన ప్రయోరసమే రాయప్రోలు వారిచే ‘అమలిన శృంగారం’గా నరుూకరించబడింది! కథానిక, నాటకాది వచన సాహిత్య ప్రక్రియాపరంగా రాయప్రోలు వారు యుగకర్త అయ్యారు. శాంతినికేతన్‌లో రవీంద్రుని గురుత్వం వల్ల కూడా రాయప్రోలు వారి అక్షరాలు నవ్యాంధ్ర శారదానికేతనాలయ్యాయి. ‘కలసిన యంత మాత్రమున కాదుసుమీ! చెలికార మంతరంబుల నతుకంగ జాలిన అపూర్వపు లంకెయె స్నేహమ’న్న సిద్ధాంతమే అక్షరామల ‘తృణకంకణమ’యింది! ఆయన రచనలన్నీ ‘రమ్యాలోకన’ ‘మాధురీ దర్శనాలు’! ‘లలిత’ ‘స్నేహలతా’ ‘లావణ్య సరస్వతులు’! ఆంధ్ర భారతికి జడ అల్లి ‘జడకుచ్చులి’డిన నవ్యాలంకారికులు రాయప్రోలు వారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్ర భాషా సాహిత్యాచార్యులై ఎందరికో కవితాక్షర భిక్ష పెట్టిన మహనీయులు రాయప్రోలు వారు. ఆయనకు జన్మనిచ్చిన గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడు గ్రామం ధన్యం - గణ్యం!

- హరితశ్రీ,
గుంటూరు.
చరవాణి : 9866944287