విశాఖపట్నం

పరిశోధనకు వెళ్ళేవాళ్ళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1962, 63, 64 సంవత్సరాల్లో ఎయులో చదువుకునే రోజుల్లో రీడింగ్ రూంకు వెళ్ళాను. ఇతిహాసాలపై పరిశోధన చేసేందుకు అక్కడి పుస్తకాలు ఎంతో ఉపకరించాయి. విశాఖనగరంలో ప్రాచీన, ప్రసిద్ధి చెందిన గ్రంథాలయం ఇది. అప్పట్లో ఇదే గొప్పది. ఎటువంటి పుస్తకమైనా రీడింగ్ రూంకు వెళ్తేనే దొరికేది. కొన్ని పుస్తకాలు ఫస్ట్ ఎడిషన్ కూడా దొరికేవి.
*
- ఆచార్య కోలవెన్ను మలయవాసిని
**

స్వల్ప రుసుంతో
సాహితీ సభలకు ఇవ్వాలి
*
స్వాతంత్య్ర లేదా సాహిత్య ఉద్యమం జరిగినా హిందూ రీడింగ్ రూం ప్రాంతంలోనే ప్రారంభమయ్యేది. రోజులు మారడంతో దూరప్రాంతమైంది. నేటి రచయితలు, సాహితీప్రియులు సభలు నిర్వహించుకోవాలంటే, ఖర్చు తడిసిమోపుడవుతుంది. స్వల్ప రుసుంతో సభలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలి. అప్పుడే సాహితీ సుగంధాలు పరిమళిస్తాయ.
*
- అంగర కృష్ణారావు
**
నిధులు వస్తురూపంలో ఇవ్వాలి
*
40 ఏళ్ళుగా సభ్యుడిగా ఉండేవాడిని. తర్వాత కార్యదర్శి పదవి చేపట్టాను. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించాం. దాతలు ఆదుకోవాలి. అయితే, నేరుగా నిధుల రూపంలో కాకుండా వస్తురూపంలో అందజేయాలని కోరుతున్నాం.
*
- సింహాద్రి సూరిబాబు, రీడింగ్ రూం కార్యదర్శి
**
సేవాదృక్పథంతో ముందుకు వెళ్తున్నాం
*
కమిటీ సభ్యులు వచ్చి అధ్యక్షపదవి స్వీకరించమని కోరారు. దాంతో ఓ రోజు రీడింగ్ రూంను సందర్శించాను. అక్కడ పరిస్థితి చూసి, బాధ కలిగింది. అభివృద్ధి నడుంకట్టాను. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాను. కొంతమంది సేవాదృక్పథం కలిగిన మిత్రులతో రీడింగ్ రూం మేడపై పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతీయువకులకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాం. సమాజానికి ఉపయోగపడే సాహితీ సభలు కూడా నిర్వహించుకోవచ్చు. హిందూ రీడింగ్ రూంకు మచ్చ లేనివిధంగా జరుపుకోవచ్చు.
*
- తమ్మిరెడ్డి శివశంకరరావు
డిప్యూటీ కమర్షియల్ టాక్స్ కమిషనర్,
ది హిందూ రీడింగ్ రూం అధ్యక్షుడు.