రాష్ట్రీయం

‘మెట్ల’కు అంతిమ వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 26: అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్ నిమ్స్‌లో కన్నుమూసిన మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు అంత్యక్రియలు శనివారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. ముందుగా మెట్ల భౌతికయాన్ని ఊరేగింపుగా అమలాపురం కిమ్స్ ఆస్పత్రి సమీపంలో ఆయన పేరిట నిర్మించే ఘాట్‌కోసం ఎంపిక చేసిన స్థలం వద్దకు తీసుకువచ్చారు. సాయంత్రానికి హెలికాప్టర్‌లో అమలాపురం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మెట్ల భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. మెట్ల కుమారుడు రమణబాబు, అల్లుడు, కాకినాడ ఎంపి తోట నరసింహంను పరామర్శించారు. అనంతరం సంతాప సూచకంగా పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. మెట్ల కుమారుడు రమణబాబు చితికి నిప్పంటించారు. మెట్ల అంత్యక్రియలకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు.
అప్తుణ్ని కోల్పోయాం:చంద్రబాబు
మెట్ల సత్యనారాయణరావు ఆకస్మిక మృతితో తాను వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని, తెలుగుదేశం పార్టీ ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మెట్ల ఎంతో కృషి చేశారన్నారు. ** మెట్ల భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు **