రాష్ట్రీయం

హైటెక్ సిటీ వరకు మెట్రో లైన్ కోసం ఆస్తుల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:సెప్టెంబర్‌నాటికి హైటెక్ సిటీ మార్గంలో మెట్రో పనులు పూర్తవుతాయని మెట్రో ఎండీ ఎస్సీఎన్ రెడ్డి వెల్లడించారు. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో పనులు పొడిగించాలని సీఎం చంద్రశేఖర్ సూచించారని ఆయన తెలిపారు. అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో మార్గం ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. కమ్యూనికేషన్ బేస్‌డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ వినియోగించడం దేశంలోనే తొలిసారి అని మెట్రో ఎండీ తెలిపారు. సీబీటీసీ పరిజ్ఞానం వినియోగించడం వల్లే మెట్రో పూర్తి చేయడంలో కొంత జాప్యం జరుగుతున్నదన్నారు. హైటెక్ సిటీ వరకు మెట్రో లైన్ కోసం ఆస్తుల సేకరణ జరుగుతున్నదని ఆయన తెలిపారు.