జాతీయ వార్తలు
మంత్రి రాజ్బర్ను తొలగించిన యోగి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 May 2019
లక్నో: యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్బర్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ రాజ్నాయక్కు లేఖ రాశారు. సీఎం లేఖను పరిశీలించిన గవర్నర్ మంత్రి తొలగింపునకు ఆమోద ముద్ర వేశారు. ఉత్తరప్రదేశ్లో 2017 భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓపీ రాజ్బర్ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ గుర్తుపై తనను పోటీ చేయాల్సిందిగా కోరారని, తాను తనకు కేటాయించిన గుర్తుపైనే పోటీ చేస్తానని వెల్లడిస్తూ మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినట్లు మే ఒకటవ తేదీన వెల్లడించారు. తన రాజీనామాను కూడా ఆమోదించలేదని కూడా తెలిపారు. సీఎం ఆయనను మంత్రివర్గం నుంచి తొలిగిస్తూ రాసిన లేఖపై గవర్నర్ ఆమోదముద్ర వేశారు.