జాతీయ వార్తలు

ఉగ్రవాదం వల్ల నష్టపోయేది పేదలే:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీహార్: ఉగ్రవాదం వల్ల నష్టపోయేది పేదలేనని, పేదలు బలోపేతం కావాలంటే ఉగ్రవాదం అణిచివేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన దర్భంగా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ దేశ భద్రత కోసం అధిక నిధులు ఖర్చుచేయాల్సి వస్తుందని, పేదలకు దక్కాల్సిన ఈ నిధులు వారికి ఉగ్రవాద నిర్మూలనకు ఖర్చుచేయాల్సి వస్తుందని అన్నారు. వందేమాతారం, భారత్‌మాతాకి జై అనే నినాదాలు కొందరికి రుచించటం లేదని అన్నారు. అటువంటివారు డిపాజిట్లు కోల్పోతారు అని అన్నారు. మూడు విడతుల ఎన్నికల తరువాత విపక్షాలు సైనికుల మెరుపుదాడుల ఆధారాలు అడగటం మానేసి ఇపుడు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయని అన్నారు. దేశభద్రత అనేది మహాకల్తీ కూటమికి పెద్ద సమస్య కాదట అని అన్నారు.