జాతీయ వార్తలు

వారణాసి నుంచి మోదీ నామినేషన్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన కాలభైరవుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న మోదీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, శిరోమణి అకాలీదళ్ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.