జాతీయ వార్తలు

పనిమనిషి కొడుకు ప్రధాని కావడం అంబేద్కర్ పుణ్యమే: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: ఇతరుల ఇళ్లలో పాచిపనులు చేసిన మహిళ కొడుకు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుణ్యమేనని ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంతో అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం వౌలో గురువారం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, తన తల్లి ఇతరుల ఇళ్లలో అంట్లుతోమి తనను చదివించిందని గుర్తుచేసుకున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ నేతలు దేశాన్ని ఏలినా అంబేద్కర్‌కు తగిన స్మారక చిహ్నం ఏర్పాటు చేయలేక పోయారని ఆయన ఆరోపించారు