జాతీయ వార్తలు

కాశ్మీరీ యువతను రెచ్చగొడుతున్నవారికి గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో యువతను రెచ్చగొట్టి అక్కడ విధ్వంసానికి, అల్లర్లకు కారణమవుతున్నవారిని వదిలిపెట్టేది లేదని, ప్రజలకు వారంతట వారే సమాధానం చెప్పుకోలవలసి వస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. కాశ్మీర్‌పై దేశం అంతా ఒకే గొంతుకతో నినదిస్తోందని, భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమని, ఈ విషయంలో తప్పు చేస్తున్నవారికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. మన్‌కీబాత్‌లో భాగంగా ఆయన రేడియోలో చేసిన ప్రసంగంలో ఈ హెచ్చరిక చేశారు. జిఎస్‌టి బిల్లు ఆమోదంపైకూడా ఆయన స్పందించారు. 125కోట్ల భారతీయుల సంక్షేమంకోసం చట్టసభలు సమష్టి నిర్ణయం తీసుకున్నాయని ఆయన శ్లాఘించారు.