ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక హోదాపై టిడిపి పాలిట్బ్యూరోలో చర్చ?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 April 2016
విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా అవసరం లేదంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ప్రకటించడంతో తమ నిరసన గళం వినిపించేందుకు టిడిపి నేతలు సమాయత్తమవుతున్నారు. మే 3న ఇక్కడ జరిగే పార్టీ పాలిట్బ్యూరో సమవేశంలో ప్రత్యేక హోదాపై చర్చించాలని కొందరు నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్రం వైఖరిపై నిరసన తెలిపేలా తీర్మానం చేయాలని వారు భావిస్తున్నారు. మే 2న ఎపి క్యాబినెట్ సమావేశంలోనూ, అదే రోజు జరిగే టిడిపి సమన్వయ కమిటీ భేటీలోనూ ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. అయితే, ఎన్డిఎలో తాము భాగస్వామిగా ఉన్నందున కేంద్రంపై బహిరంగ విమర్శలు చేయకుండా తమ వాణి వినిపించాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది.