తెలంగాణ

ప్రలోభాలతో ఫిరాయింపులు: మల్లు రవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రలోభాలకు గురిచేసి ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటూ సిఎం కెసిఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. అనైతిక ఫిరాయింపులను జనం సైతం అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, మిషన్ కాకతీయ కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని ఇన్నాళ్లూ విమర్శించిన నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇపుడు తెరాసలో ఎలా చేరుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ అవినీతి ఇపుడు అదృశ్యమైందా? అని వ్యాఖ్యానించారు. పదవులకు రాజీనామా చేసి తెరాసలో చేరితే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు.