ఆంధ్రప్రదేశ్‌

జైల్లో ఆమరణ దీక్ష చేస్తా:ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపులకు రిజర్వేషన్లు అమలు చేసేంతవరకూ తన పోరాటం ఆగదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తన దీక్షపై తెలుగుదేశం నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన సోమవారం విలేఖరులతో అన్నారు. పేదరికం నుంచి బయటపడాలని కాపులంతా కోరుకుంటున్నారని, ఇందుకు రిజర్వేషన్లు అవసరమన్నారు. తనను అరెస్టు చేసినా సరే జైల్లోనే ఆమరణ దీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు కాపులకు రిజర్వేషన్లను కల్పించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని ఆయన అన్నారు.