రాష్ట్రీయం

మాకు ఫ్లెక్సీలు పెట్టుకునే స్వేచ్ఛ లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబుకు ముద్రగడ లేఖ
ప్రత్తిపాడు, డిసెంబర్ 12: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా? ఎమర్జెన్సీని విధించారా? ప్రజలను స్వేచ్ఛగా బతకనివ్వరా అంటూ మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పలు ప్రశ్నలు, హెచ్చరికలు సంధిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను శనివారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో విడుదల చేశారు. ఇటీవల రాష్టవ్య్రాప్తంగా కాపులు జనవరి 31న జరుపుకునే కాపు ఐక్యగర్జన ఫ్లెక్సీలు తీసివెయ్యమని పలుచోట్ల పోలీసులచే చంద్రబాబు దాడులు చేయిస్తున్న నేపథ్యంలో ముద్రగడ రెండు పేజీల లేఖను విలేఖరులకు అందజేశారు. ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో ముద్రగడ నేతృత్వంలో జరిగే సమావేశం తేదీలతో ఉన్న ఫ్లెక్సీలు కాపుజాతి రోడ్లపై పెట్టుకోకూడదా? రాష్ట్ర భూభాగం అంతా చంద్రబాబు సొంత జాగీరా? చంద్రబాబు తాతగారు ఆయనకు ధారాదత్తం చేశారా? అని ఆయన లేఖలో ప్రశ్నించారు. చంద్రబాబు ముఖంతో ఉన్న పచ్చ ఫ్లెక్సీలే రోడ్లపై ఉండాలా? కాపు జాతి తలుచుకుంటే బాబు ఫ్లెక్సీలన్నీ నాశనం చేయగలరని, కానీ తమ జాతికి ఆ పని చేయడానికి సంస్కారం అడ్డు వస్తోందన్నారు. కాపులను బిసిల్లో కలిపి ఏటా 1000 కోట్లు ఇవ్వడానికి డబ్బులేదని చెబుతూనే ఒక పక్క కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని హద్దు పద్దు లేకుండా రాజధాని శంకుస్థాపన పేరుతో ఎలా ఖర్చు చేశారని ముద్రగడ చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో కాపుజాతి చెల్లించే పన్నులు, సెస్సులు లేవా? ఈ ఆదాయం అంతా చంద్రబాబు తాతగారి వల్ల ప్రభుత్వానికి వస్తోందా? అని ముద్రగడ ప్రశ్నించారు. కాపుల స్వేచ్ఛకు అడ్డురాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆలోచన చేయాలన్నారు. మీరు,మీ నాయకులు తరచూ ప్రతి సమావేశంలో కాపులను బిసిల్లో చేరుస్తున్నామని కొంగ జపం చేస్తున్న మీరు జపం ఆపి హామీల అమలు దిశగా కార్యాచరణ చేయాలన్నారు.