జాతీయ వార్తలు

నేడు ఢిల్లీకి చేరుకోనున్న సియాచిన్ మృతుల శవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: సియాచిన్‌లో మంచు తుపాను కారణంగా చనిపోయిన తొమ్మిది మంది సైనికుల మృత దేహాలను వాతావరణం అనుకూలించిన పక్షంలో సోమవారం ఢిల్లీకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అయితే ప్రమాదం జరిగిన కార్‌డుంగ్‌లా వద్ద వాతావరణం ఇప్పటికీ అనుకూలంగా లేదని, అయినప్పటికీ తొమ్మిది మంది సైనికుల మృత దేహాలను లేహ్‌కు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే రేపటికల్లా మృతదేహాలను ఢిల్లీకి తీసుకువస్తామన్నారు. ఆ తర్వాత వారి స్వస్థలాలైన బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, మదురై, పుణె, హైదరాబాద్‌లకు పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 3న వచ్చిన మంచు తుపానులో మద్రాసు రెజిమెంట్‌కు చెందిన ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి, మరో ఎనిమిది మంది జవాన్లు సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే.