జాతీయ వార్తలు

ఇ-కేటరింగ్‌పై ‘క్యాష్ బ్యాక్’ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: కనీసం 300 రూపాయల విలువ కలిగిన ప్రీ పెయిడ్ ఆర్డర్లపై 50 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందించే ఒక కొత్త పథకాన్ని భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ప్రారంభించింది. ఈ నెల 13నుంచి ఈ పథకం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని ఐఆర్‌సిటిసి సిఎండి ఎకె మనోచా చెప్పారు. ఒకే ఆర్డర్‌లో రూ.300కు పైగా విలువ కలిగిన భోజనానికి మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ చర్య ఐఆర్‌సిటిసికి చెందిన ఇ-కేటరింగ్ కార్యకలాపాలకు మంచి ఊపును కల్పిస్తుందని మనోచా చెప్పారు. ఈ ఆఫర్ రైలు ప్రయాణికులు తమ ఇ-కేటరింగ్ సదుపాయాన్ని మరింతగా ప్రోత్సహించడానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ పథకం కేవలం ప్రీ పెయిడ్ పద్ధతిలో బుక్ చేసిన భోజనాలకే వర్తిస్తుంది. ఐఆర్‌సిటిసికి చెందిన వెబ్‌సైట్ లేదా ‘్ఫడ్ ఆన్ ట్రాక్’ మొబైల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే బుక్ చేసి ఉండాలి. డెలివరీ డేట్ తర్వాత క్యాష్ బ్యాక్ మొత్తాన్ని భోజనం ఏ అకౌంట్ ద్వారా ఆర్డర్ చేసారో అదే అకౌంట్‌లోకి క్రెడిట్ చేస్తారు. ఐఆర్‌సిటిసి క్యాష్ బ్యాక్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత కస్టమర్‌కు తెలియజేయడం జరుగుతుందని మనోచా చెప్పారు.