నల్గొండ

కెసిఆర్‌ను గద్దె దింపడమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, ఏప్రిల్ 22: రాబోయో ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌ను గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకరావడమే తమ అంతిమ ద్యేయమని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోరటికల్ గ్రామంలో నిర్వహించిన కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్దాలు, మాయ మాటలలో ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్న టి ఆర్ ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే 2019 ఎన్నికలలో మునుగోడు నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా పోటి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటివల చండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సభతో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి గుబులు పుట్టిందని హెద్దేవా చేశారు. ఎన్ని ఆటంకాలు వచ్చిన అధిష్టానాన్ని ఓప్పించి మునుగోడు నియోజక వర్గంలో పోటి చేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అబివృద్ది చేస్తానని హమి ఇచ్చారు. ఇంట గెలిచి రచ్చగెలవాలన్న పెద్దల మాటాలను మరిచి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా పదవులు చేపట్టి డిల్లీ రాజకీయాలను శాసించిన దివంగత ఎంపి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఒక చిన్న గల్లీని కూడా అబివృద్ది చేయలేదన్నారు. తన సొంత గ్రామం చండూర్ మండల పరిధిలోని ఇడికూడ గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామేతగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి జాజుల అంజయ్యగౌడ్, టిపిసిసి అధికార ప్రతినిధి నారబోయిన రవి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జాల వెంకన్నయాదవ్,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మేకల ప్రమోద్‌రెడ్డి, యువజన నాయకులు పాల్వాయి జితేందర్‌రెడ్డి,బీజం విజయ్‌కుమార్, జంగిలి నాగరాజు, నాయకులు సాగర్ల లింగస్వామి, చిలుకరాజు శంకర్, దోటి నారాయణ, దండు పరుశురాం,హైమద్, తదితరులు పాల్గోన్నారు.