నల్గొండ

ఆంధ్రా న్యాయమూర్తులు ఏపీకి వెళ్లాలని న్యాయవాదుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, మే 10: ఆంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసనలు తెలిపారు. అనంతరం కోర్టు గేటు ముందు రాస్తారోకో నిర్వహించిన అనంతరం తెలంగాణలోనే ఉంటామని సమ్మతి తెలిపిన ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తుల వివరాలతో కూడిన సమ్మతి జాబితాను దహనం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంత న్యాయమూర్తులకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్‌లు మట్లాడుతూ అనేక త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు బంగం కలిగేటట్లుగా ఉందని, వెంటనే ఉమ్మడి హైకోర్టును విభజింజి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మిర్యాల లెనిన్‌బాబు, ఎన్.్భమార్జున్‌రెడ్డి, మొబినుల్లాఖాన్, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌పి ప్రవీణ్‌కుమార్, ఎ.శంకరయ్య పాల్గొన్నారు.