క్రైమ్/లీగల్

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, జూలై 28: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చేపూరు గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాల్వపల్లి సైదులు (33) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని ఆరు ఎకరాల్లో పత్తిని సాగు చేశాడు. ఇందుకు గానూ 5లక్షల రూపాయలు గ్రామస్తుల వద్ద అప్పు చేశాడని, దిగుబడి రాకపోవడంతో అప్పు తీర్చే మార్గంలేక మనస్థాపంతో శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడని, గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.