నల్గొండ

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, నలుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, మే 16: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా నలుగురికి గాయాలైన సంఘటన సోమవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన చంద్రగిరి అవధాని, అనిత, న్యాన్సి(23), డ్రైవర్ గిరిలతో టాటాఇండికా కారులో గుంటూరులో ప్లాటును చూసేందుకు వెళుతుండగా కారు చిట్యాల శివారులోకి రాగానే హైదరాబాద్‌కు చెందిన కె. సురేందర్, వెంకటరత్నమ్మ, డ్రైవర్ స్వామిలు టాటాసుమో వాహనంలో వెళుతూ ఎదురుగా వెళుతున్న ఇండికా కారును ఢీకొట్టింది. సుమో ఇండికాను ఢీకొట్టడంతో కారులో ఉన్న న్యాన్సి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందగా అనిత, సురేందర్, వెంకటరత్నమలకు బలమైన గాయాలు కాగా డ్రైవర్‌లు గిరి, స్వామిలకు స్వల్పగాయాలైనాయి. న్యాన్సి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రామన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ యాదగిరి తెలిపారు.