నల్గొండ

హమీలను విస్మరించిన టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, అక్టోబర్14: టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో విఫలమైందని టీడీపీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్యాయి రజనీకుమారి విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, కేజీ నుండి పీజీ ఉచిత విద్య, ఇంటింటికి నల్లా నీరు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ వంటి హమీలను విస్మరించిందని అన్నారు. మండలంలోని పెద్దకాపర్తి, వనిపాకల గ్రామాల్లో ఆదివారం పార్టీ నాయకులతో కల్సి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో మహకూటమి అభ్యర్ధిగా నకిరేకల్ నియోజకవర్గం నుండి తనను ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శేపూరి సుదర్శన్, మండల అధ్యక్షులు ఎండీ జహంగీర్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి అశోక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పిశాటి మాధవరెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ నియోజకవర్గ ఇంచార్జి బొడిగె విజయ్‌కుమార్, మండల అధికార ప్రతినిధి కొంపెల్లి సైదులుగౌడ్, నాయకులు చింతకింది తిర్మలయ్య, బుంగపట్ల తిమ్మయ్య, మురాల గోపాల్, మందుల శివ, ఆవుల శ్రీనివాస్, యాకారి మత్సగిరి, మర్రి నాగిరెడ్డి, బిక్షంరెడ్డి, బత్తుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.