నల్గొండ

కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, నవంబర్ 19: కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని అనంతరం విలేఖరులతో మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా నాగార్జున సాగర్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రతిపక్ష నేత చేసిన అభివృద్ది శూణ్యమన్నారు. రాబోయే ఎన్నికలలో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి నోముల నర్సింహయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుండి అధిక అసెంబ్లీ స్థానాలను గెలుపొంది కేసిఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలో నాగార్జున సాగర్ ఉన్నప్పటికి గుర్రంపోడు మండలం ఎడారిగా మారిందన్నారు. దీనికి కారణం జానారెడ్డి అని రాబోయే ఎన్నికలలో జానారెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్తాలన్నారు. అనంతరం కర్నె ప్రభాకర్ సమక్షంలో పాంపాటి మురళి తన యాభై మంది అనుచరులతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ రాం చందర్ నాయక్, ఎంపిటీసిల ఫోరం నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి పాషం గోపాల్‌రెడ్డి, జడ్పీటీసి గాలి రవికుమార్ గౌడ్, విజయేందర్ రెడ్డి, కిరణ్, ప్రవీణ్ రెడ్డి, రామగిరి చంద్రశేఖర్ రావ్,బొడ్డుపల్లి బ్రహ్మచారి, ధనుంజయ, షేక్ సయ్యద్ మియా, పగిల్ల లాలాయ్య, ఎరుకల రామలింగం, మంచుకంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.