నల్గొండ

మద్దిరాలలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దిరాల, డిసెంబర్ 7: శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తుంగతుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్ పోలింగ్ బూత్‌లను పరిశీలిస్తుండగా టీఆర్‌ఎస్ వర్గీయులు బూత్‌లోకి వెళ్లగానే కాంగ్రెస్ వర్గీయులు పోలింగ్‌బూత్‌లోకి కార్యకర్తలు ఎలా వెళ్తారని, గో బ్యాక్ గాదరి కిషోర్ అని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతోపాటు తోపులాటకు దిగడంతో ఏం జరుగుతుందో అన్న భయం స్థానికంగా వ్యక్తమైంది. చివరకు పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టగా గాదరి కిషోర్‌కుమార్ వెనుతిరిగి పోవడంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.