నల్గొండ

యాదాద్రిలో ఘనంగా నిత్యారాధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, డిసెంబర్ 7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి నిత్యారాధనలు, ఆర్జిత సేవలు శుక్రవారం శాస్తయ్రుక్తంగా సాగాయి. సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేసి బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా ప్రతిష్ఠామూర్తులను ఆరాధించిన పూజారులు పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి సుగంధ పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కవచమూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు. బాలాలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో, కార్తీకమాసం దీపారాధనలు, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం పురస్కరించుకుని ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. మహిళలు ఊంజల్ సేవోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, కీర్తనలతో అమ్మవారిని కొలిచారు. పూజారులు హారతి నివేదన చేశారు.