నల్గొండ

మోగిన పంచాయతీ నగరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 1: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో పంచాయతీ పోరుకు నగరా మోగినట్లయింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో 475 గ్రామపంచాయతీలు, 4,322వార్డు స్ధానాలు ఉండగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ షెడ్యూల్‌ను వెలువరించింది. ఈమేరకు ఈనెల 21, 25, 30 తేదీలలో పోలింగ్ జరగనుంది. జిల్లాలో సూర్యాపేట, కోదాడ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని ఉన్న 23 మండలాల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తారు. మొదటివిడత ఎన్నికలకు ఈనెల 7, రెండవ విడతకు ఈనెల 11న, మూడో విడతకు ఈనెల 16న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. మొదటి విడతన ఏడు మండలాలు, రెండో విడతన తొమ్మిది మండలాలు, మూడవ విడతన ఏడు మండలాలల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా పరిధిలో కేవలం రెండు రెవెన్యూ డివిజన్‌లు మాత్రమే ఉండటం వల్ల రెండు డివిజన్‌ల పరిధిలోని మండలాల్లో మూడు విడతల ఎన్నికల నిర్వహించేలా విభజించారు. మొదటి విడతలో కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాలోని 161 సర్పంచ్, 1456 వార్డుసభ్యుల స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత కోసం 7న నోటిఫికేషన్ జారీచేసి నామినేషన్‌ల స్వీకరణ చేపడతారు. ఈనెల 9వరకు నామినేషన్‌లు స్వీకరించి 10న పరిశీలన పూర్తిచేసి 11న ఉపసంహరణల అనంతరం జనవరి 21న ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం నుండి లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడతలో హుజూర్‌నగర్, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని హుజూర్‌నగర్, మఠంపల్లి, చిలుకూరు, తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల మండలాల్లోని 160 గ్రామాల్లోని సర్పంచ్‌లు, 1462 వార్డుస్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం ఈనెల 11న నోటిఫికేషన్ జారీచేసి 13వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. 14న పరిశీలన చేపట్టి 15న నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం జనవరి 25న పోలింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. అదేవిధంగా మూడోవిడతలో సూర్యాపేట, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), మేళ్లచెర్వు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరుడుచర్ల, పాలకీడు మండలాల్లోని 154 పంచాయతీలు, 1404 వార్డుస్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను జనవరి 16న ప్రకటన విడుదల చేసి 18వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. 19న పరిశీలన పూర్తిచేసి 20న ఉపసంహరణల అనంతరం ఈనెల 30న పోలింగ్ నిర్వహించి వెనువెంటనే లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా జిల్లాలో వార్డుస్థానాల సంఖ్యను పరిశీలిస్తే గరిడేపల్లి మండలంలో అత్యధికంగా 294వార్డులున్నాయి. ఈ మండలంలో పంచాయతీల సంఖ్య 32. అతితక్కువ వార్డు స్థానాలతో హుజూర్‌నగర్ మండలంలో 110 వార్డులు ఉండగా మొత్తం 11పంచాయతీలు ఈ మండలంలో ఉన్నాయి.

ఉదయభానుడి కిరణాలతో..
పసిడి తళుకులీనిన యాదాద్రి ఆలయం
* అబ్బురంగా తిలకించిన భక్తజనం
యాదగిరిగుట్ట, జనవరి 1: అద్భుత శిల్పసంపదతో నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయం నూతన సంవత్సరం మంగళవారం తెల్లవారుజామున పసిడివర్ణ శోభితంగా తళుకులీనింది. నల్లసరం కృష్ణశిలలతో నిర్మితమైన ఆలయం గోపురాలపై ఉదయభానుడి కిరణాలు పడిన సమయంలో గోపురాలు, శిఖరాలు బంగారువర్ణ కాంతులతో తళుక్కుమనగా ఈ అపురూప దృశ్యాలను భక్తులు అబ్బురంగా తిలకించారు. సూర్యభగవానుడి కిరణాలు ఎలాగైతే సప్తరాజగోపురాలపై మెల్లగా పడుతు వృద్ధి చెందుతూ వెళ్లగా కిరణాల విస్తరణను అనుసరించి గోపురాలపై బంగారు వర్ణ కాంతులు సైతం అలాగే పెరుగుతు కనువిందు చేశాయి. సూర్యకిరణాలు పూర్తిగా గోపురాలపై పడిన పిదప శే్వతకాంతులుగా మారిపోయాయి. తెల్లవారుజామున నూతన ఆలయం ముంగిట ఉన్న భక్తులు ఉదయభానుడి లేత కిరణా వెలుగుల్లో స్వర్ణకాంతులతో మెరిసిన పంఛనారాసింహుడి నూతన ఆలయాన్ని చూసి ఆలయ నిర్మాణాన్ని కొనియాడటం కనిపించింది.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించాలి
- కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి
కోదాడ, జనవరి 1: శాంతి భద్రతలలో కోదాడ డివిజన్ అగ్ర స్థానంలో ఉందని, 2019లో కూడా ఎలాంటి మచ్చ లేకుండా అందరూ పనిచేసి ప్రజలతో మమేకమై మంచిపేరు తెచ్చుకోవాలని ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి కోరారు. కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, రామినేని ట్రాన్స్‌పోర్టు యజమాని రామినేని శ్రీనివాసరావు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా డివిజన్ పరిధిలోని డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ నూతన సంవత్సరంలో ఎలాంటి గొడవలు లేకుండా శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఆనందంగా జీవించాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి, రూరల్ సీఐ రవి కుమార్, మునగాల సీఐ శివశంకర్ గౌడ్, హుజూర్‌నగర్ సీఐ శ్రీ్ధర్, డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ గుత్తా
దేవరకొండ, జనవరి 1: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌ను మంగళవారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో పార్టీ వర్కింగ్ అధ్యక్ష హోదాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా ఉన్నారు.