నల్గొండ

పంతంగి ప్రాథమిక పాఠశాలలో.. డిజిటల్ తరగతులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 4: మండలంలోని పంతంగి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దిండు భాస్కర్ ఆధ్వర్యంలో కస్తూరి ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్‌లను శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులకు బ్యాగులు, నోటుపుస్తకాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి సహకారం అందించడం అభినందనీయమన్నారు. సంపద అందరికీ ఉన్నా దానం చేసే గుణం కొందరికే ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సహకారం అందిస్తున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజు, అరుణ, బాతరాజు అండాలు, సాగర్ల లింగయ్య, అంతటి రాజేష్, బర్రె శేఖర్, జెమ్మి సురేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ భూముల అభివృద్ధికి కృషి
* కొత్తగూడెం సీపీఎఫ్ రాజారావు

నడిగూడెం, జనవరి 4: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అటవీ భూముల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కొత్తగూడెం సీపీఎఫ్ రాజారావు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని రామాపురం అటవీ భూముల్లో నిర్మిస్తున్న ఫెన్సింగ్, గేట్లు పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. అటవీ భూములు అణ్యక్రాంతం కాకుండా కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నడిగూడెం మండలంలోని రామాపురం అటవీ భూముల్లో సుమారు 8 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అవసమైన దగ్గర గేట్లు నిర్మిస్తున్నుట్ల తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందారెడ్డి, కోదాడ ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మిపతిరావు బీట్ ఆఫీసర్ మాచర్ల అచ్చయ్య పాల్గొన్నారు.
ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి
* హాజరైన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ రూరల్, జనవరి 4: అంధుల కోసం లిపిని కనుగొన్న లూయిస్ బ్రెమిలీ 210జయంతిని శుక్రవారం పట్టణంలోని దివ్యాంగుల బాలుర కళాశాల వసతి గృహంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జ్యోతి ప్రజ్వలన గావించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అంధులు తేలికగా చదువగలిగే, రాయగలిగే బ్రెయిలీ లిపిని కనిపెట్టి అద్భుతాన్ని ఆవిష్కరించారన్నారు. ఈ లిపి ద్వారా ఎంతోమంది చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారనీ, సంబంధిత శాఖ ద్వారా కూడా అనేక సంక్షమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ. శైలజ, సూపరింటెండెంట్ నర్సింగరావు, డ్వాబ్ కార్యదర్శి చొక్కారావు, వసతిగృహ నిర్వాహకులు వెంకట్ రెడ్డి, అస్మా, పెంటయ్య తదితరులున్నారు.

యాదాద్రిలో ఘనంగా నిత్యారాధనలు
* అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట, జనవరి 4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి నిత్యారాధనలు, ఆర్జిత సేవలు శుక్రవారం శాస్తయ్రుక్తంగా సాగాయి. సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేసి బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా ప్రతిష్ఠామూర్తులను ఆరాధించిన పూజారులు పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి సుగంధ పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కవచమూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు. బాల ఆలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాయంత్రం అండాళ్ అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం పురస్కరించుకుని ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. మహిళలు ఊంజల్ సేవోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, కీర్తనలతో అమ్మవారిని కొలిచారు. పూజారులు హారతి నివేధన చేశారు. స్వామివారిని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీలు రఘుమారెడ్డి దర్శించుకున్నారు. వారి వెంట డైరక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ వెంకన్న, డీఈ కృష్ణగౌడ్, ఏడీ శ్రీనివాస్, ఏఈ సుధాకర్‌రెడ్డి ప్రభృతులు ఉన్నారు.

నిస్వార్థ నాయకులను ఎన్నుకోండి
ప్రజా స్వామ్యాన్ని కాపాడండి
* సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి పిలుపు
4
చిట్యాల, జనవరి 4: స్థానిక సంస్థల ఎన్నికల్లో నిస్వార్ధంగా పని చేసే నాయకులను ఎన్నుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పిలుపు నిచ్చారు. గ్రామ పంచాయతీ, వార్డు స్థానాల్లో సీపీఎం బలపర్చిన అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించనట్లయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జర్గిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి ధనిక వర్గాల వారు అధికారం చేజిక్కించుకునే పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు ఇలాంటి వాటికి లొంగ కుండా గ్రామంలో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకుడినే ఎన్నుకోవాలని కోరారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య, నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజన్న, పానుగుళ్ళ అచ్చాలు, ఐతరాజు నర్సింహ, రుద్రారపు పెద్దులు, రాచకొండ శ్యాంసుందర్, తిరుగుడు సన్యాసిరావు, గోపగోని వెంకన్న, గుడిసె లక్ష్మినారాయణ, జోగు లక్ష్మయ్య, జన్నపాల జానయ్య, మందుగుల యాదయ్య, బూర్గు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సిద్ధం కానున్న రైతు వేదికలు..
ఒక్కో వేదిక నిర్మాణానికి 12లక్షలు..
142 క్లస్టర్లకు గాను 124 క్లస్టర్లకు భూసేకరణ పూర్తి
నల్లగొండ రూరల్, జనవరి 4: రైతు సంక్షేమం దృష్ట్యా వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే సమాచారాన్ని తెలియపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితి (రైసస)ని ఏర్పాటు చేసి సభ్యులను నియమించింది. ఇప్పటికే అనేక సబ్సిడీ పథకాలతో పాటు రైతుబంధు, రైతు బీమాలాంటి ప్రతిష్టాత్మక పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు మెరుగైన సమాచారాన్ని అందించేందుకు సమన్వయ సమితి సభ్యుల సేవలను మరింతగా వినియోగించుకోనుంది. వీటిని భవిష్యత్‌లో కొసాగిస్తూ వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనిలో భాగంగానే రైతులకు ప్రత్యేక కేంద్రాలు ఉండడంతో పాటు రైతు సమన్వయ సమితి సభ్యులను సమన్వయకర్తలుగా వినియోగించుకుంటూ రైతు వేదికల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రైతు సమన్వయ సమితి సమితులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇద్దరు లేదా నలుగురు సభ్యులను ఒక చోట చేర్చి అధికారులను అనుసంధానం చేసి రైతు వేదికను నిర్మించనుంది. ఒక్కో వేదిక నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 142 వ్వవసాయ క్లస్టర్లు ఉండగా, ఇప్పటికే 124 క్లస్టర్లలో భూసేకరణ పూర్తయింది. ప్రభుత్వానికి నివేదించిన తర్వాత నిధుల కేటాయింపు అనంతరం పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ద్వారా భవనాలు నిర్మించాలని నిర్ణయంచింది. ఇప్పటికే డిజైన్స్ పూర్తయ్యాయని ఆయా భవనాల్లో ఎప్పటికప్పుడు రైసస సభ్యులు రైతులకు సంధానకర్తలుగా ఉండి చర్యలు తీసుకుంటారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ రైసస సభ్యుల నుండి జిల్లా రైసస వరకు మొత్తం 9 వేల 230 మంది సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు సంధానకర్తలుగా నియమితులయ్యారు. వీరి సేవలను ఉపయోగించుకోని వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో 562 రెవెన్యూ గ్రామాల్లో 14 మంది చొప్పున సభ్యులు ఉండగా ఒకరు కన్వీనర్‌గా ఉన్నారు. మొత్తం ఆయా గ్రామాల్లో 8 వేల 430 మంది ఉన్నారు. మరో 31 మండలాల్లో 24 మంది చొప్పున సభ్యులు, ఒక కన్వీనర్ ఉన్నారు. మొత్తం 775 మంది మండల సమితి సభ్యులుగా ఉన్నారు. జిల్లాస్థాయిలో 24 మంది సభ్యులతో పాటు మరొకరు కన్వీనర్‌గా ఉన్నారు. ఇలా మొత్తంగా 9 వేల 230 మంది రైససల నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా వీరిని సమన్వయ పరుచుకుని రైతులకు చేరువ కావాలని ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించింది. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వస్తే రైసస సభ్యులకు గౌరవ వేతనం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో రైతులకు సేవలందించేందుకుగాను గ్రామీణ రైతు సమన్వయ సమితి సభ్యుల నుండి రాష్ట్ర సమితి సభ్యుడు వరకు కొంత గౌరవ వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రామీణ సమన్వయ సమితి సభ్యులకు నెలకు వెయ్యి, కన్వీనర్‌కు 15 వందలు, మండల రైసస సభ్యులకు 15 వందలు, కన్వీనర్‌కు 2వేలు, జిల్లా రైసస సభ్యులకు 2వేలు, కన్వీనర్‌కు 5వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంఋన్నట్లు సమాచారం.

మిషన్ కాకతీయకు ఆగిన నిధులు..!
పెండింగ్‌లో రూ.251 కోట్ల బిల్లులు
బిల్లుల విడుదలైతేనే పనులు ముందుకు..!

నల్లగొండ, జనవరి 4: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం పనులు నిధుల కరవుతో ఆగిపోయాయి. వానలు పడితేనే చెరువులు నిండు.. నిధులందితేనే చెరువుల పనులన్నట్లుగా కాంట్రాక్టర్లు ఇప్పటికే చేసిన పనుల కోసం రావాల్సిన బిల్లులు విడుదలైతేనే కొత్తగా పనులు చేస్తామంటు పనులు ఆపివేశారు. ఇప్పటిదాకా జరిగిన పనులకు సంబంధించి 251కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టులు చెరువుల పునరుద్ధరణ పనుల కొనసాగింపులో చేతులెత్తేశారు. జిల్లాలో 4200 చెరువులుండగా 3,135 చెరువుల పరిధిలోని 2లక్షల 7,075 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా నాలుగు విడతల్లో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. తొలి విడత మిషన్ కాకతీయ కింద 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.169 కోట్లతో 807 చెరువుల పునరుద్ధరణ పనులు జరిపించారు. 804 చెరువులకు రూ.164కోట్లు చెల్లించారు. 2015-16 రెండో విడతలో రూ.248 కోట్లతో 1058 చెరువుల పునరుద్ధరణ పనులను ప్రారంభించి 1029 చెరువుల పనులకు రూ.189 కోట్లు చెల్లించారు. మూడో విడతలో 2016-17లో రూ.155 కోట్లతో 840 చెరువుల పునరుద్ధరణ చేపట్టి 435 చెరువుల పనులు పూర్తిచేసి రూ.56 కోట్లు చెల్లించారు. 2017-18లో నాల్గో విడత మిషన్ కాకతీయ కింద 429 చెరువుల పునరుద్ధరణ పనులను రూ.72 కోట్లతో చేపట్టి 69 చెరువుల పనులు పూర్తి చేయగా 3 కోట్ల 30లక్షల రూపాయలు చెల్లించారు. చివరి మూడు విడతల్లో కలిపి రూ.251 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఒక్కటి పూర్తికాని మినీ ట్యాంకుబండ్‌లు
ఉమ్మడి జిల్లాల పరిధిలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హుజూర్‌నగర్ మినహా మిగతా 11 నియోజకవర్గాల్లో మినీ ట్యాంకుబండ్ చెరువుల పనులనుల రూ.4023 కోట్లతో చేపట్టారు. 2018 డిసెంబర్ నెలాఖరుకల్లా మినీ ట్యాంకుబండ్ చెరువుల పనులు పూర్తికావాల్సివుండగా రూ. 198.92 కోట్లు ఖర్చయినప్పటికి నేటికి ఎక్కడా ఒక్క మినీ ట్యాంకుబండ్ పనులు పూర్తి కాలేదు. ఆలేరు కొలనుపాక, భువనగిరి పెద్దచెరువు పనులు 85 శాతం పూర్తికాగా, సూర్యాపేట చౌదరి చెరువు, నల్లగొండ బతుకమ్మ చెరువు, దేవరకొండ భీమనపల్లి చెరువుల పనులు 80 శాతం, నకిరేకల్ నల్లచెరువు, మునుగోడు ఊర చెరువు పనులు 75 శాతం పూర్తయ్యాయి. తుంగతుర్తిలో మోత్కూర్ పెద్దచెరువు పనులు 72 శాతం, మిర్యాలగూడ యాద్గారపల్లి చెరువు పనులు 70 శాతం, కోదాడ పెద్దచెరువు పనులు 65 శాతం పూర్తయ్యాయి. మినీ ట్యాంకుబండ్ నిర్మాణ కాంట్రాక్టర్లకు కూడా బిల్లుల బకాయిలు ఉండటంతో పనులు నిలిపివేసి బిల్లుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
రాష్ట్రంలో మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందునా మిషన్ కాకతీయకు మరోసారి దండిగా నిధులొస్తాయని, పెండింగ్ బిల్లుల చెల్లింపు జరుగుతుందని ఇరిగేషన్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఆశిస్తుండగా ఈ దిశగా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సివుంది.

పంచాయతీ ఎన్నికల్లో
మొదటిసారిగా ‘నోటా’
* పల్లెల్లో నిరక్షరాస్యులకు ఇబ్బంది
వలిగొండ, జనవరి 4: గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఎన్నికల సంఘం ‘నోటా’ను ప్రవేశపెట్టింది. బ్యాలెట్ పేపర్‌లో చివరగా నోటా గుర్తును ముద్రించడం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో 2014 నుండి నోటాను అమలులోకి తీసుకురాగా నోటాకు కూడా ఎంతో స్పందన లభించింది. దీనితో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒక్కొక్క ఓటే కీలకం కావడంతో నోటాపై ఆసక్తి నెలకొంది. గ్రామాల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు ఉండే అవకాశం ఉండడంతో ఓట్లు వేసే క్రమంలో గుర్తులు సరిగా తెలియక తికమక పడే ప్రమాదం ఉందని ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు పోటీ చేసే అభ్యర్థులు తెలియజేస్తున్నారు. ఓటర్లకు అభ్యర్థులు నచ్చకపోయిన ఓటర్లు నోటాకు ఓటువేసి తమ వ్యతిరేకతను వెల్లండించే అవకాశం వచ్చిందని పలువురు ఓటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో నోటాకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఓట్లు నమోదయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని చెప్పవచ్చు.

నాణ్యమైన విద్యుత్‌లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్
24 గంటల విద్యుత్‌ను అందించిన ఘనత విద్యుత్ సిబ్బందిదే..
జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్ డి ప్రభాకర్‌రావు

యాదగిరిగుట్ట రూరల్, జనవరి 4:ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో గృహావసరాలకే కాకుండా వ్యవసాయం,కంపెనీలకు 24 గంటల కరెంటును అందించడంలో ప్రతి ఒక్క విద్యుత్ అధికారుల,సిబ్బంది కృషి ఉందని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించ గలిగామని రాష్ట్ర జెన్‌కో,ట్రాన్స్‌కో చైర్మన్ డి ప్రభాకర్ అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో తెలంగాణ పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్యర్యంలో భవన నిర్మాణానికి (గెస్ట్‌హౌస్)నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున విద్యుత్ అందకారమే అంటున్న సందర్బంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు సూచనలతోఖర్చుకు వెనకాడకుండా నాణ్యమైన ట్రాన్స్‌ఫార్మర్‌లను కొనుగోలు చేసి అధికారుల కృషితోనే నిరంతర విద్యుత్ సాధ్యమైందని అన్నారు.విద్యుత్ వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. గతంలో కరెంటు లేక పోతే వార్త ఉండేదని నేడు కరెంటు పోతేనే వార్త అవుతుందని అన్నారు.ప్రతి నెల 2700 కోట్ల ఖర్చు ఉందని 1935 కోట్ల రెవెన్యు ఉందని 800 కోట్ల నష్టంతో ఉన్నా కరెంటు కష్టాలు ప్రజలకు తెలువకుండా చేస్తున్నామని అన్నారు.రఘరామ్‌రెడ్డ మాట్లాడుతూ గ్రామాలలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి ఎలక్షన్‌లలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్‌కే ప్రథమ స్థానం ఇచ్చారని స్విచ్ ఏస్తే కరెంటు,ప్రతి గ్రామంలో నిరంతర విద్యుత్‌ను అందించగలుగుతున్నామని అన్నారు.వ్యవసాయదారులకు 24 గంటల కరెంటు ఇవ్వడంమే విద్యుత్ ఉద్యోగుల కృషికి నిదర్శనమని అన్నారు.గోపాల్ మాట్లాడుతూ విద్యుత్‌ను అందించడంలో ఎలాంటి రిమార్కు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రం నులమూల అందించగలుగుతున్నామని ప్రజలు విద్యుత్ ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ బేసీరెడ్ది,డైరీ డైరెక్టర్ నరేష్‌కుమార్,రాష్ట్ర అధ్యక్షులు మధుసూధన్‌రెడ్డి,గోవర్థన్‌రెడ్డి,వర్కింగ్ ప్రసిడెంట్ చెలపతిరావు,రాష్ట్ర సెక్రటరీ జనరల్ నర్సింహ్మలు,డైరెక్టర్లు,ఏఈలు,ఏడీలు పాల్గొన్నారు.