నల్గొండ

సాగర్ ప్రాజెక్టు సిఇ బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, మే 26: నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా మరియు ఎఎంఆర్‌పి పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పురుషోత్తంరాజు తెలంగాణ రాష్ట్ర సచివాలయ విచారణ విభాగపు సిఇగా బదిలి అయ్యారు. అక్కడ సిఇగా విధులు నిర్వహిస్తున్న ఎస్.సునీల్ సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా బదిలిపై రానున్నారు. గతంలో సాగర్ ప్రాజెక్టు సిఇగా విధులు నిర్వహించిన ఎల్లారెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా పురుషోత్తంరాజు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిదిలోని ఆధునీకరణ పనులను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పరిశీలించిన కొన్ని రోజులకే సాగర్ ప్రాజెక్టు సిఇ బదిలి కావడం గమనార్హం. పురుషోత్తంరాజు బదిలికి సంబందించిన ఉత్తర్వులు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరి శైలేద్రకుమార్‌జోషి బుధవారం రాత్రి విడుదల చేశారు.