నల్గొండ

కుమార్తెను కడతేర్చి తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జూన్ 14: మానసికంగా కుంగిపోతూ కండ్ల ముందు ఉన్న వికలాంగురాలైన కూతురు సుమనశ్రీకి(9) సేవ చేయలేక కూతుర్ణి కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్కట్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునుగోడు మండల కేంద్రానికి చెందిన అంగన్‌వాడి టీచర్‌గా పని చేస్తున్న నారగోని కల్పనకు కూతురుతోపాటు కుమారుడు ఉన్నాడు, ఐదు సంవత్సరాల క్రితం భర్త వెంకటేశం చనిపోగా అంగన్‌వాడిగా పని చేస్తూ జీవనం గడుపుతుంది. పుట్టుకతో మూగ అయిన సుమనశ్రీకి సేవ చేయలేక నిత్యం మానసికంగా కుంగిపోతూ అకస్మాత్తుగా సోమవారం రాత్రి ఇంటి నుండి బయలు దేరి నార్కట్‌పల్లి శివారులోగల వేణుగోపాలస్వామి ఆర్చి వద్ద తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో కూతరు గొంతు కోసి కల్పన కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతరం స్వయంగా కల్పనే తన మామ భక్తయ్యకు ఫోన్ చేసి సంఘటన వివరించడంతో స్పందించిన భక్తయ్య వెంటనే 108వాహనానికి సమచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని తల్లికూతుల్లను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కూతురు సుమనశ్రీ మృతి చెందింది. కల్పన ప్రమాదం నుండి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సంఘటనా స్థలాన్ని నల్లగొండ డిఎస్పీ సుధాకర్, నార్కపల్లి ఎస్‌ఐ మోతీరాంలు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.