నల్గొండ

2019వరకు పిసిసి నాయకత్వంలో మార్పుండదు:పాల్వాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 2: కాంగ్రెస్ పార్టీ అదిష్టానానికి పిసిసి ఛీఫ్ ఉత్తమ్ నాయకత్వంపై విశ్వాసముందని 2019వరకు పిసిసి నాయకత్వ మార్పు ఉండబోదని రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ 2019వరకు పిసిసి ఛీఫ్ పదవిపై ఆశపెట్టుకున్న వారికి భంగపాటు తప్పదంటూ పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తేల్చి చెప్పారు. కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల మద్య గ్రూపు తగాదాలతోనే తాను కాంగ్రెస్ నుండి వీడినట్లు గుత్తా చెప్పుకోవడం సరికాదన్నారు. పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీలు మారినవారిని ప్రజలు నిలదీయాలన్నారు. కొంత మంది నాయకులు సిద్దాంతాలు మరిచి చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని విమర్శించారు. ఫిరాయింపు దారులను ప్రజలు, కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారని గ్రామాలలోకి వస్తే వారిని నిలదీయాలన్నారు.
కమీషన్ల కోసం పార్టీలు మారిన వారితో దరిద్రం పోయిందన్నారు. కోవర్టులుగా పార్టీలో ఉండే కంటే పార్టీ వీడిపోవడమే మంచిదన్నారు. ఈ సమావేశంలో పాషం సంజయ్, బోయ రామచందర్, చింతల వెంకట్‌రెడ్డి, కొండా యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్ భవనానికి ప్రారంభోత్సవం..
జడ్పీ భవనానికి మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన
నల్లగొండ టౌన్, జూలై 2: పట్టణంలో 5కోట్లతో నూతనంగా నిర్మించిన ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్ వసతి గృహ సముదాయ భవనానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి శనివారం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మరో 5కోట్లతో నిర్మించనున్న జిల్లా పరిషత్ నూతన కార్యాలయం భవనం నిర్మాణ పనులకు ఆయన జడ్పీ కార్యాలయం ఆవరణలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మొక్కలు నాటారు.