ఆంధ్రప్రదేశ్‌

రైతులకు త్వరలో ప్లాట్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజధాని నిర్మాణం కోసం పంటపొలాలను ఇచ్చిన రైతులకు అక్టోబర్ 14 నుంచి నెలరోజుల్లోగా ప్లాట్లను పంపిణీ చేస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన బుధవారం అమరావతి ప్రాంతంలో పర్యటించారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులకు ఇప్పటికే 147 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అమరావతిలో ఎలక్ట్రిక్ బస్సులు, రైళ్లను నడిపేందుకు విదేశీ సంస్థలతో చర్చలు జరుపుతున్నామన్నారు. రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి సింగపూర్ బృందంతో చర్చలు ముగింపుదశకు వచ్చాయని, ఈనెల 15 నాటికి ప్రధాన ఆర్కిటెక్ట్‌ను నియమించే అవకాశం ఉందన్నారు.