జాతీయ వార్తలు

హేమకే ఓటేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మథుర, ఏప్రిల్ 14: ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఆదివారం తన భార్య, బీజేపీ ఎంపీ హేమమాలిని తరపున మథురలో ప్రచారం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో హేమమాలినికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ‘హేమామాలినికి ఓటు వేయండి. మీ మద్దతు లేకుండా మేము నగర అభివృద్ధి దిశగా ఒక్క అడుగు కూడా మందుకు వేయలేము’ అని ధర్మేంద్ర ఇక్కడ ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ అన్నారు. ఆదివారం అంతకు ముందు హేమామాలిని సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో మథుర నియోజకవర్గంలో తనకు మద్దతుగా తన భర్త ధర్మేంద్ర ప్రచారం చేస్తారని తెలిపారు. ‘ఈరోజు నాకు ప్రత్యేకమయిన రోజు. ధరమ్‌జీ ఈ రోజంతా నా తరపున ప్రచారం చేయడానికి ఇక్కడే ఉన్నారు. ప్రజలు ఆయనను చూడాలని, ఆయన ఏమి చెబుతారో వినాలని ఎంతో ఉత్సుకతతో వేచి చూస్తున్నారు’ అని హేమమాలిని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, మథుర నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను చేసిన పని తిరిగి ఈ ఎన్నికల్లో తనను గెలిపించడానికి దోహదపడుతుందని హేమామాలిని శనివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వాసం వ్యక్తం చేశారు. ‘నేను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు నీరు, విద్యుత్తు సౌకర్యాలను అందించాను. మథురలో పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాను. ప్రజలు గతంలో పాస్ట్‌పోర్ట్‌లు తీసుకోవడానికి అలీగఢ్ లేదా ఇతర పట్టణాలకు వెళ్తుండేవారు. రహదారులను విస్తరించడం జరిగింది. నియోజకవర్గంలో అనుసంధానం బాగా పెరిగింది’ అని హేమామాలిని అన్నారు. మథుర లోక్‌సభ నియోజకవర్గంలో రెండో దశలో ఈ నెల 18న పోలింగ్ జరుగనుంది.
చిత్రం... మథుర నియోజకవర్గంలో హేమమాలినికి మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆమె భర్త ధర్మేంద్ర