జాతీయ వార్తలు

ఇద్దరు ఎన్నికల సిబ్బంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, మే 19: ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ విధి నిర్వహణలోనే ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. 56 ఏళ్ల రాజారాం పిప్రాజ్ ప్రాంతంలోని విద్యాలయ్ మాదాపూర్‌లోని 381 నెంబర్ పోలింగ్ బూత్‌లో విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. కాగా, బాన్స్‌గామ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 219 పోలింగ్ బూత్‌లో విధి నిర్వహణకు వెళ్లిన వినోద్ శ్రీవత్సవ కూడా గుండెపోటుకు గురయ్యారు. అతనిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని అధికారులు తెలిపారు.