జాతీయ వార్తలు

కిషన్‌రెడ్డికి మంత్రి పదవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపడుతున్న నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ నుండి సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆధిక్యత సంపాదించిన జీ.కిషన్‌రెడ్డికి మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి. తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లలో ఆధిక్యంలో ఉండటం తెలిసిందే. కిషన్‌రెడ్డి బీజేపీ యువమోర్చాలో పనిచేసినప్పటి నుండీ నరేంద్ర మోదీకి సన్నిహితుడు. అందుకే బండారు దత్తాత్రేయను కాదని కిషన్‌రెడ్డికి సికింద్రాబాద్ టికెట్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కిషన్‌రెడ్డి విజయం సాధిస్తే కేంద్రంలో ఏర్పడే కొత్త మంత్రివర్గంలో స్థానం లభించటం ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో రానున్న ఐదేళ్లలో బీజేపీని పటిష్టం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా కృషి చేస్తారు. ఈ లక్ష్య సాధనకోసం కిషన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం లభించటంతోపాటు తెలంగాణ నుండి విజయం సాధించే మిగతా ఎంపీలను కూడా సముచిత పదవుల్లో నియమించే అవకాశాలున్నాయి.