జాతీయ వార్తలు

గెలిచిన అభ్యర్థులకు ఉపరాష్ట్రపతి అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: ప్రజాస్వామ్య పునాదులను పటిష్టపరిచే దిశగా తమ ఆకాంక్షలను తెలియజేస్తూ సుస్థిరమైన ప్రభుత్వంకోసం ఓటు వేసిన ప్రజలందరికీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఉప రాష్టప్రతి కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు సజావుగా, సమర్థవంతంగా, శాంతియుతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అపారమైన ప్రజా విశ్వాసాన్ని చూరగొని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు, పార్టీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉన్నతమైన ప్రజాస్వామ్య మూలాలను మరింత పటిష్టపరుచుకుంటూ అభివృద్ధి సంస్కరణల ద్వారా సమష్టి కృషితో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా పార్టీలకు అతీతంగా అందరం కలసి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
జగన్‌కు ఉప రాష్ట్రపతి అభినందనలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఉప రాష్ట్రపతి వెల్లడించారు.