జాతీయ వార్తలు

మరింత అభివృద్ధికి మోదీతో కలసి పనిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: ఢిల్లీ మరింత అభివృద్ధి సాధించేందుకు కేంద్రంలో ఏర్పడబోయే నరేంద్ర మోదీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల తమ పార్టీ పరాజయం పాలైన విషయమై ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ప్రజల తీర్పును తామెప్పుడూ గౌరవిస్తామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే అఖండ విజయంతో చరిత్ర సృష్టించడాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఢిల్లీ నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్‌లో మాత్రమే ఆప్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లోనూ ఈ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చెందిన మంచి అభ్యర్థులనే ఎంపిక చేశామని, అందుకు తగ్గట్టే ప్రచారం నిర్వహించామని, కానీ ఫలితాలు తమకు అనుకూలంగా రాలేదని ఆయన ఒక ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, దానికి తాము పూర్తిగా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.