జాతీయ వార్తలు
కుమారస్వామితో జగన్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 June 2019
న్యూఢిల్లీ, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన అధికార నివాసంలో కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఉదయం వైఎస్సార్సీపీ ఎంపీలతో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన అంనంతరం ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికార నివాసం ఒకటి జన్పథ్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. అలాగే ఏపీ-కర్నాటక మధ్య నెలకొన్న నీటి సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.
చిత్రం... ఢిల్లీలోని తన నివాసంలో విందు సందర్భంగా కర్నాటక సీఎం కుమారస్వామితో సమావేశమైన జగన్