జాతీయ వార్తలు

కొడుకుల కోసం తండ్రులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: కొడుకులు పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. దాన్ని చూడడానికి తండ్రులు లోక్‌సభకు వచ్చారు. ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ టిఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం రాజ్యసభకు మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి డి.శ్రీనివాస్ కుమారుడు అరవింద్ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే చిదంబరం కుమారుడు కార్తి కాంగ్రెస్ అభ్యర్థిగా తమిళనాడు శివగంగా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. తెలంగాణ, తమిళనాడుకు చెందిన ఎంపీలు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో తమ కుమారుల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు డి.శ్రీనివాస్, చిదంబరం గ్యాలరీకి వచ్చారు. అలాగే తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి వారి కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు పార్లమెంటుకు తరలివచ్చారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి భార్య, కుమార్తె, అల్లుడు పార్లమెంట్‌కు వచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, పీ.రాములు, కవిత మాలోతు, బీబీ పాటిల్, వెంకటేశ్ నెతకాని, కొత్త ప్రభాకర్‌రెడ్డి కుంటుబ సభ్యులు పార్లమెంట్‌కు వచ్చారు.

చిత్రం... చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్‌తో పాటు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన డీఎస్