జాతీయ వార్తలు
రాష్ట్ర హక్కుల కోసం కలిసి పనిచేద్దాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 12 July 2019
న్యూఢిల్లీ, జూలై 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధనలో అందరం కలిసికట్టుగా పని చేద్దామని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులకు ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన వైస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతరహిత పారదర్శక పాలన అందించేందుకు ప్రతిక్షణం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్ లక్ష్య సాధనకు పాటుపడదామని ఆయన కోరారు. ఏపీ భవన్ అధికారుల నేతృత్వంలో ఏపీ పార్లమెంట్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ ఎంపీలు పాల్గొన్నారు.