జాతీయ వార్తలు

పోలవరం అంచనా వ్యయం రూ.55వేల కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాజ్యసభలో వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాసానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. గిరిజన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైందని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 2014-2019 మధ్య అప్పటి ప్రభుత్వం హయాంలో చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్న విషయం వాస్తమమేనా? ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా అంటూ విజయసాయిరెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. వాటిపై తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అనేక అవరోధాలు, అవాంతరాలను అధిగమించి ఈ దశకు చేరుకున్న పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,000 కోట్లకు చేరింది. సవరించిన అంచనాల ప్రతిపాదనలు ఆమోదం పొందడానికి సుమారు ఏడాది కాలం పట్టింది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రతిపాదనలను రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించడానికి కారణం, ఆవశ్యకత ఏమిటి? ఈ కమిటీ తన ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపించడానికి ఇంకెంత కాలం పడుతుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ ఏపీ విభజన చట్టం ప్రకారం ఏప్రిల్ 2014 నాటికి పోలవరం ప్రాజెక్టు కింద
ఇరిగేషన్ అంశానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వ భరించాలి. ఆ మేరకు ఇప్పటివరకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ అంశం కింద ఖర్చయిందని పేర్కొన్నారు. మరో 7168 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం చెల్లించాలి. అయితే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలను సమర్పించింది. ఈ అంచనాలను ప్రాథమికంగా ఆమోదించిన పిమ్మట తదుపరి ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించడం జరిగింది. అంచనా వ్యయం పెంపుకు దారితీసిన కారణాలపై లోతుగా అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ కమిటిని ఏర్పాటు చేయవలసిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ఆ మేరకు తమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయవలసి వచ్చిందని మంత్రి వివరించారు. ఈ కమిటీ జూన్ 26న తొలిసారిగా సమావేశమైంది. తదుపరి సమావేశాలు కూడా త్వరితగతిన నిర్వహించడానికి తమ వంతు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2017-18 ధరల స్థాయికి అనుగుణంగా కేంద్ర జల సంఘానికి సమర్పించిన సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.57వేల కోట్లు కావాలని అడిగిందని పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే భూములు, నష్ట పరిహారం చెల్లించాల్సిన భూములు, మిగిలిన పనుల నిర్వహణకు నిర్ణయించిన రేట్లు తదితర అంశాలపై జరిగిన సర్దుబాట్లతో సవరించిన అంచనా వ్యయం రూ.55వేల కోట్లకు తగ్గించినట్టు కేంద్ర మంత్రి వివరించారు.

చిత్రం... కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్