జాతీయ వార్తలు

గడ్కరీకి తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, ఆగస్టు 13: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, మరో 158 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్ నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన ఇండిగో విమానానికి (నెం.6ఇ-636) సాంకేతిక లోపం ఏర్పడడంతో పైలట్ విమానాన్ని టేక్‌ఆఫ్ చేయకపోవడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే భారీ నష్టమే జరిగేది. మంగళవారం ఉదయం 7.50 గంటలకు నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం బయలుదేరి ఢిల్లీకి 9.35 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కాగా రన్-వే నుంచి విమానం టేక్‌ఆఫ్ కావడానికి ముందే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. దీంతో విమానాన్ని నిలిపి వేసి మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. గడ్కరీ ఇండిగోలోనే ఢిల్లీకి మధ్యాహ్నం 1.54 గంటలకు చేరుకున్నారు.